జంట కవి మిత్రులు
మచ్చ లక్ష్మయ్యభువనగిరి
నాగిళ్ళ బాబయ్య గుప్త
నివాసం : భువనగిరి
జంటకవి మిత్రులు::
ఇద్దరి పురుటి గడ్డ ఒక్కటే•••కాటెపల్లి గ్రామం
వీరిద్దరు పదవ తరగతి వరకు చదువుకున్నది
ఒకే బడి "జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల చాడ" నల్లగొండ జిల్లా. ప్రస్తుతం యాదాద్రి జిల్లా.
వీరు ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే
వారిలో సాహిత్య అభిలాష ఆసక్తి బీజాలు
అంకురించినాయి.
ఈ ఇద్దరు బాల్యమిత్రులు--నాగిళ్లబాబయ్యగుప్త
మచ్చ లక్ష్మయ్య. ఉన్నత పాఠశాల విద్యపిదప
వీరి జీవన గమనం మారింది.
బాబయ్యగుప్త తల్లితండ్రులుకిరాణ దుకాణం
లో కూర్చుండి వృత్తిపని నేర్చుకొమ్నని బలవంత
పెట్టినారు కాని వృత్తిమీద ఆసక్తి చూపలేదు
మనసునందలి సాహిత్యాభిమాన ప్రేరణతో
జడ పెద్దల మాటలను లక్ష్యపెట్టక సారస్వత పరిష
త్తు హైదరా బాదులోచేరి తెలుగు B.0.L పట్టా
1974సం.లోపొందిన పిదప తెలుగుపండితజ
శిక్షణానంతరం 1979సం.లో ప్రభుత్వ ప్రాథమి
కోన్నత పాఠశాల బాగాయత్ భువనగిరి లో
జూనియర్ తెలుగు పండితునిగా ఉపాద్యాయ
వృత్తిలో జీవనయానం సాగింది.
మచ్చ లక్ష్మయ్య కుటుంబపరిస్థితి అస్తవ్యస్త ముగా వుండటంవలన బ్రతుకుదెరువు
బొంబాయి (ముంబాయి)కివెళ్లి అక్కడ నేతకార్మి
కునిగా తమ వృత్తినికొనసాగించినాడుద. నేత
మగ్గాలనునడుపుతూ నేత బిడ్డల నిజపరిస్థితి
ని నెమరుకు తెచ్చుకొంటున్నాడు. సాహిత్యాభి
మాని కాబట్టితీరిక సమయాన్ని కూడ వృధా
కచేయక వివిధ గ్రంథాలను అధ్యయనంచేయ
టమే కాక వ్యాకరణం మీద పట్టు సాదించాడు.
అమరకోశం వంటి గ్రంథరాజాలను శ్రద్ధతో
చదివి సాహిత్యం మీదకొంతపట్టుసాధించిన
సాహితీ కృషీవలుడైనాడు.ఇంకా వైద్య సం
బంధ D.M.L.కామర్స్ లోడిప్లొమాపొందినాడు
తనలోనిసాహిత్య ప్రవాహాన్ని ఆపలేక బొంబా
యి లోనే1976సం.లోనేత పనివారలఇక్కట్ల
గురించి వారి ప్రతిభను తెలియ జేసేపద్యాలను
ఛందోబద్దంగా పాఠకులకు సులభంగా అర్థమ
య్యె రీతిలో చక్కని చిక్కనిశైలిలో వ్రాసి తన
ప్రతిభను చాటుకున్నాడు. కొంత కాలం పిదప
బొంబాయి నుంచి సొంత ఊరుకు చేరి కొన్ని
నెలల తరువాత భువనగిరిలో పాథాలోజికల్
లాబ్ పెట్టి వైద్య సేవలనందించినాడు.
భువనగిరిలో వుంటున్న బాల్యమిత్రులు
ఇద్దరు కలిసికున్నారు. యవదశలో ఇద్దరి
మిత్రుల స్నేహలతపల్లవించి మొగ్గదొడిగి పుష్పించి సాహితీ సౌరభాన్ని ప్రసరించింది.
వీరు సాహితీ సభలలో పాల్గొనడానికి ఉత్సు
కత కనపరచె వారు కాదు. తీరిక సమయాల్లో
సాహితీ ముచ్చట్లు చెప్పుకొనేవారు. వీరు శతకం
వ్రాయాలనే తలంపుతో సంవత్సరకాలం శ్రమిం
చి సామాజిక అధ్యాత్మికసందేశాత్మిక పద్యరచ
నలు చేసి మొదట "మిత్రశతకము "తదుపరి
"శ్రీ సాయినాథ శతకము"వేంకటేశ్వర శతకము"
రాసి అభిప్రాయాల కోసం సాహితీ మిత్రులకు
పంపినారు. ముద్రణ ప్రయత్నంలో వుండగా
చిన్న చిన్న అవంతకారణాలవల్ల ముద్రణ సమయం మార్చవలసివచ్చింది.
ఊహించని పరిణామం ! కరుణలేనికాలం
ఒకే సంవత్సరంలో (2015)ఆలోకనుంచి
వేరుచేసింది. కుటుంబాల్లో మిత్రబృందంలో
అభిమానుల్లోఆత్మీయుల్లో విషాదంనింపింది
జంట కవి మిత్రులు .......
మచ్చ లక్ష్మయ్య నాగిళ్లబాబయ్యగుప్త
వారుభౌతికంగా లేకున్నా వారు రాసిన
శతకాలలో చిరంజీవులుగా వున్నారు.
వారి ఆశయ సాహితీ కృతులు వృధా
కాకుండా కవిమిత్రులజ్ఞాపకార్థ చిహ్నం
గా వుండి వారి ఆత్మలకు శాంతి
కలిగించునని భావిస్తున్నాను.
ఈశతకాలు వీరిని చిరస్మరణీయులుగ
నిలిపి వారి కుటుంబాలకు ప్రశాంత
జీవనం ప్రసాదించాలని శారదమాతను
నిండు మనస్సుతో వేడుకుందాం.
జంట కవి మిత్రులకు అక్షర శ్రద్ధాంజలి
ఘటిస్తూ............
ఆత్మీయ
లెక్కల మల్లా రెడ్డి
విశ్రాంత ఉపాద్యాయుడు
సైదాపురం యాదాద్రి.


No comments:
Post a Comment